
సహజ వనరులను రక్షించుకోవాలి
న్యూశాయంపేట : సహజ వనరులను రక్షించుకోవాలని భద్రాద్రి జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) భీమా నాయక్ సూచించారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని సుబేదారి ఫారెస్ట్ కాంప్లెక్స్ నుంచి హంటర్రోడ్లోని కాకతీయ జూ పార్క్ వరకు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జూ పార్క్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రతీ ఒక్కరు పాటుపడాలన్నారు. కాకతీయ జూ పార్క్ను ప్లాస్టిక్ రహిత జూ గా మార్చేందుకు కృషిచేయాలని అధికారులను ఆదేశించారు. జూ పార్క్లో తెల్లపులి, సింహాలు తెచ్చే ప్రయత్నంలో ఉన్నామని సందర్శకులకు మరి కొద్ది రోజులల్లో వీక్షించే వీలు కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా జూ పార్క్లో మొక్కలు నాటారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ అనుజ్ అగర్వాల్, ఎఫ్ఆర్ఓ మయూరీ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రవిబాబు, తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ను నిషేధించాలి:ఆర్డీఓ వైవీ గణేష్
హన్మకొండ కల్చరల్ : ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతిపౌరుడు నిషేధించాలని జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేష్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం వరంగల్లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాల ప్రాంగణంలో యునైటెడ్ నేషన్స్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ తెలంగాణ రాష్ట్ర చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యకళాశాల ప్రిన్సిపాల్ అనసూర్య, హార్టికల్చర్ అధికారి రమేశ్, కమిటీ సభ్యులు డాక్టర్ బి.సాంబమూర్తి, సంస్థ కోఆర్డినేటర్ రాజగోవిందు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పోతు మహేష్, కొంతం కృష్ణ, వడ్నాల నరేందర్, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సీసీఎఫ్ భీమా నాయక్

సహజ వనరులను రక్షించుకోవాలి