
నిజాం కాలం నాటి మర్కజీ హైస్కూల్
ప్రొఫెసర్ జయశంకర్ ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే..
విద్యారణ్యపురి: వివిధ రంగాల్లో ఉన్నతస్థానాలకు ఎదగిన ఎంతో మంది మేధావులను అందించింది హనుమకొండలోని మర్కజీ ప్రభుత్వ ఉన్నతపాఠశాల. నిజాం కాలంలో 1940లో ప్రారంభించిన ఈ పాఠశాల తొలుత ఊర్దూ మీడియంగా, తర్వాత తెలుగు మీడియంగా, ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులకు విద్య అందిస్తున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఈ పాఠశాలలోనే ఉర్దూమీడియంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఇక్కడ చదువుకున్న అనేక మంది విద్యార్థులు వివిధ దేశాల్లో, రాష్ట్రంలో వివిధ ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారు. ఈ స్కూల్లో ప్రస్తుతం 676 మంది విద్యార్థులు ఉండగా, 26మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో 284 మంది చదువుతుండగా 10 మంది టీచర్లు ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా విద్యార్థులు కలిగిన ప్రభుత్వ పాఠశాలగా గుర్తింపు పొందింది.