
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ట్రెయినీ కలెక్టర్లు
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ట్రెయినీ కలెక్టర్లు సౌరభ్ శర్మ, సలోని చోబ్రా, హర్ష చౌదరి, కెరోలిన్ చింగ్తయానమావి, కొయ్యాడ ప్రణయ్ కుమార్ బృందం గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెనను పరిశీలించి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్హౌస్ను సందర్శించింది. పంపుహౌస్ వివరాలను ఇరిగేషన్ డీఈ సత్యబాబు వివరించారు. విద్యుత్ వినియోగం, ఎత్తిపోతల వివరాలు, స్టోరేజీ, మో టార్ల సామర్థ్యం, సాగు, తాగు అవసరాల వినియోగంపై వివరించారు. అనంతరం ట్రెయినీ కలెక్టర్ల బృందం మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని సందర్శించింది. మహదేవపూర్ డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, లైసన్ అధికారి అబ్బాస్, కోర్సు డైరెక్టర్ శ్రీనివాస్, డీఈ సురేశ్ తదితరులు ఉన్నారు. కాగా, ట్రెయినీ కలెక్టర్ సౌరభశర్మ శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.