
30 మంది అధికారులు
రెండు
గంటలు..
కాజీపేట రూరల్ : సౌత్ వెస్ట్రన్ ఇంటర్ రైల్వే సేఫ్టీ ఆడిట్ అధికారుల బృందం గురువారం సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో కాజీపేట జంక్షన్కు చేరుకుంది. రైల్వే గేట్లు, వంతెనలు, సిగ్నల్ పాయింట్లు, ట్రాక్ను తనిఖీ చేసుకుంటూ కాజీపేటకు చేరుకున్న సౌత్ వెస్ట్రన్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన దాదాపు 30 మంది బృంద సభ్యులకు కాజీపేట రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీ ప్రిన్సిపాల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ రామకృష్ణ నేతృత్వంలో సౌత్ వెస్ట్రన్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, కాజీపేట అధికారులు రైల్వే సీఆర్ఎస్ఈ వి.ఎం.దాస్పుత్ర, సీనియర్ డీఈఎన్ కోఆర్డినేషన్ రవీంద్రనాథ్, సీటీపీఎఫ్ దినేశ్, సీనియర్ డీఎస్ఓ సురేశ్, సీఈఎల్ఈ, సీనియర్ డీఎస్టీఈ ప్రియ అగర్వాల్, డీఓఎం జనరల్ సుధీర్కుమార్, కాజీపేట డీజిల్ సీనియర్ డీఎంఈ వెంకటకుమార్, కాజీపేట ఈఎల్ఎస్ సీనియర్ డీఈఈ ప్రశాంత్ కృష్ణసాయి, డీఈఎన్ సెంట్రల్ ప్రంజల్ కేశర్వాణి, ఇతర అధికారులు బృందం వివిధ డిపార్ట్మెంట్లలో తనిఖీలు నిర్వహించారు. కాజీపేట రైల్వే స్టేషన్, 140 టన్నుల క్రేన్, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్, మెడికల్ రిలీఫ్ వ్యాన్ ట్రైన్, క్యారియజ్ అండ్ వ్యాగన్ డిపో, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపో, లోకోపైలెట్ కార్యాలయం, రూట్ రిలే ఇంటర్లాకింగ్ సిస్టం, రైల్వే ఎలక్ట్రిక్లోకోషెడ్, డీజిల్ లోకోషెడ్, రైల్వే ఇంజనీరింగ్ డిపో, సిగ్నల్ వ్యవస్థ, పాయింట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన విషయాలపై ఆరా తీసి నోట్ చేసుకున్నారు. గతంలో పలు చోట్ల జరిగిన రైలు ప్రమాదాలను గుర్తు చేస్తూ అలా జరగకుండా సేఫ్టీ నియమాలు పాటించాలని సలహాలు, సూచనలు చేశారు. మధ్యాహ్నం 3.09 గంటలకు చేరుకున్న అధికారుల బృందం.. రెండు గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి సాయంత్రం 5.20 గంటలకు కాజీపేట నుంచి సికింద్రాబాద్కు బయలుదేరి వెళ్లారు. అధికారుల బృందం తనిఖీల్లో కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్తోపాటు అన్ని విభాగాల అధికారులు, సూపర్వైజర్లు ఉన్నారు.
కాజీపేట జంక్షన్లో రైల్వే సేఫ్టీ బృందం తనిఖీలు
ప్రత్యేక స్పిక్ రైలులో కాజీపేటకు
చేరుకున్న సౌత్ వెస్ట్రన్ రైల్వే బృందం