
సునీల్ కుటుంబానికి అండగా ఉంటా..
ములుగు రూరల్ : అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందిన సాక్షి ములుగు ఆర్సీ ఇన్చార్జ్ భూక్య సునీల్ కుటుంబానికి అండగా ఉంటానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు గురువారం సునీల్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా సునీల్ చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సునీల్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడంతోపాటు కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆమె వెంట గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మ న్ బానోత్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్, నల్లెల భరత్కుమార్, మండల అధ్యక్షుడు చాంద్పాషా, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క