
వ్యవసాయ సర్వీస్లు త్వరగా మంజూరు చేయాలి
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లోని 16 సర్కిళ్లలో వ్యవసాయ సర్వీస్లను త్వరితగతిన మంజూరు చేయాలని ఆ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. గురువారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ లింకింగ్ లైన్లు 68 పూర్తి అయ్యాయని, ఈ నెలాఖరు వరకు మిగతా 97 పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రతీ సబ్ స్టేషన్కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్స్ కాకుండా నిర్వహణ చేపట్టాలని, పిడుగుల నిరోధకం అమర్చాలని సూచించారు. పురోగతిలో ఉన్న కొత్త సబ్ స్టేషన్ల పనులు వేగవంతం చేయాలన్నారు. పట్టణాల్లో అవసరమైన చోట 8 ఎంవీ పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు టి.సదర్ లాల్, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ రాజుచౌహాన్, జీఎంలు ఉత్తమ్, సురేందర్, డి.ఈలు అనిల్ కుమార్, ప్రభావతి పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్ రెడ్డి