
బ్లాకేజ్ ప్రాంతాల్లో మెష్లు ఏర్పాటు చేయండి
నగర మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: నగర డ్రెయినేజీల్లోని నీటి బ్లాకేజ్ ప్రాంతాల్లో మెష్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి.. ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో డివిజన్లలోని డ్రెయిన్లలో బ్లాకేజ్ ఏరియాలను గుర్తించి మెష్లు ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 66 డివిజన్లకు ఎన్ని మెష్లు అవసరమో నివేదిక సమర్పించాలని సూచించారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోష్బాబు, మహేందర్, మాధవీలత, డీఈలు రాజ్ కుమార్, సారంగం, కార్తీక్రెడ్డి, రోజా రాణి, రవి కిరణ్, రంగారావు, ఏఈలు పాల్గొన్నారు.
మేయర్ను కలిసిన అకౌంట్స్ ఆఫీసర్
బల్దియా అకౌంట్స్ ఆఫీసర్గా (ఏఓ)గా బాధ్యతలు స్వీకరించిన శివలింగం బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణిని మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. బాధ్యతాయుతంగా పనిచేయాలని మేయర్ సూచించారు.