సైక్లింగ్‌తో ఒత్తిడి దూరం | - | Sakshi
Sakshi News home page

సైక్లింగ్‌తో ఒత్తిడి దూరం

Jun 2 2025 1:29 AM | Updated on Jun 2 2025 1:29 AM

సైక్లింగ్‌తో ఒత్తిడి దూరం

సైక్లింగ్‌తో ఒత్తిడి దూరం

ఇన్‌చార్జ్‌ డీవైఎస్‌ఓ దేవిక

వరంగల్‌ స్పోర్ట్స్‌: నిత్యం ఉదయం గంట పాటు సైక్లింగ్‌ చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని జయించవచ్చని హనుమకొండ ఇన్‌చార్జ్‌ డీవైఎస్‌ఓ దేవిక అన్నారు. అంతర్జాతీయ సైక్లింగ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హనుమకొండలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఉరుకుల పరుగులు జీవితంలో ప్రతీ ఒక్కరు శారీక వ్యాయామాన్ని తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సైక్లింగ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజయ్య, వాకర్స్‌ సైక్లింగ్‌ సంఘం అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు పవన్‌కుమార్‌, శ్యాంప్రసాద్‌, డీఎస్‌ఏ కోచ్‌లు నరేందర్‌, రమేష్‌, విష్ణువర్ధన్‌, అఫ్జల్‌, శంకర్‌, వెంకట్‌, ప్రభుదాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement