
ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే టీచర్ల లక్ష్యం
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే ఉపాధ్యాయుల లక్ష్యం కావాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి కోరారు. హనుమకొండ జిల్లాలో స్కిల్స్టార్క్ స్కూల్లో ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉపాధ్యాయుల మూడో విడత శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లో అమలు చేయాలని సూచించారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఎస్సై ఎం.రాజు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎస్సై పిలిప్స్రాజు, షీటీమ్స్ ఎస్సై విద్యాసాగర్, సైబర్ క్రైమ్స్ ఎస్సై శివకుమార్ మాట్లాడారు. శిక్షణ కేంద్రం ఇన్చార్జ్లు విజయ్ మోహన్, మధుసూదన్ రెడ్డి, డీఆర్పీలు శానుగుల భద్రయ్య, జీవీ.ప్రసాద్, అజయ్, అలీ, శశికళాధర్, శివకుమార్, సంపత్, శ్రీను, విద్యానంద్, అట్ల రవి, సీఆర్పీ రఘు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ముగిసిన టీచర్ల శిక్షణ
హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, టీజీఆర్ఈఐఎస్ ఉపాధ్యాయులు, ఉమ్మడి జిల్లాలోని ఉర్దూమీడియం పాఠశాలల ఉపాధ్యాయులకు మే 13నుంచి 31వ తేదీ వరకు మూడు దశల్లో సుమారు 2,700 మందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు నైపుణ్యాలు, అభ్యసనాల అభివృద్ధి వంటి అనేక అంశాలపై శిక్షణ ఇచ్చారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి
ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణ