రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు

Jun 4 2025 1:07 AM | Updated on Jun 4 2025 1:07 AM

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు

రవాణాశాఖ కమిషనర్‌ సురేంద్ర మోహన్‌

న్యూశాయంపేట: వరంగల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌, మార్కెటింగ్‌ శాఖ సంచాలకులు సురేంద్రమోహన్‌ అన్నారు. వరంగల్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సత్యశారద, డీసీపీ ప్రభాకర్‌, సంబంధిత శాఖల అధికారులతో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఒకే ప్రాంతంలో ఐదు ప్రమాదాలు జరిగితే బ్లాక్‌ స్పాట్‌గా గుర్తించాలని.. భద్రతా ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. సమావేశంలో రవాణా శాఖ అధికారులు పురుషోత్తం, శోభన్‌బాబు, ఆర్‌అండ్‌బీ అధికారి రమేశ్‌, డీఈఓ జ్ఞానేశ్వర్‌, ఎన్‌హెచ్‌ఐఎ టీం లీడర్‌ సంపత్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

సహకార సంఘాల బలోపేతానికి కృషి

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ, మార్కెటింగ్‌శాఖ సంచాలకులు, సహకారశాఖ రిజిస్ట్రార్‌ సురేంద్రమోహన్‌ పేర్కొన్నారు. జిల్లాలో సహకార శాఖ, మార్కెటింగ్‌శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రాథమిక సహకార సంఘాలు కృషి చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్‌ సత్యశారద, జిల్లా కో–ఆపరేటివ్‌ అధికారి నీరజ, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ జగన్‌మోన్‌రావు, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement