
ప్రజల సంక్షేమానికి పథకాల తోడ్పాటు
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
నయీంనగర్: ప్రజల సంక్షేమానికి ప్రభుత్వ పథకాలు తోడ్పడతాయని, ప్రజల భాగస్వామ్యంతో పథకాలు విజయవంతమవుతాయని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి ప్రాంతాలను నివాస యోగ్యమైన, స్థిరమైన అనుకూలమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 53వ డివిజన్ ఆదర్శకాలనీలో మంగళవారం నాయిని ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమం విజయవంతం కావడానికి కాలనీవాసులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎంహెచ్ఓ రాజిరెడ్డి, కార్పొరేటర్ సోదా కిరణ్, కాలనీ అధ్యక్షుడు తూడి విద్యాసాగర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు, నరసింహస్వామి, జగదీశ్వర్ పాల్గొన్నారు.