పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలి : సీపీ | - | Sakshi
Sakshi News home page

పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలి : సీపీ

Jun 4 2025 1:07 AM | Updated on Jun 4 2025 1:07 AM

పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలి : సీపీ

పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలి : సీపీ

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రతీ అధికారి పోలీసింగ్‌పై దృష్టి సారించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ సూచించారు. మంగళవారం కమిషనరేట్‌లో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరుగుతున్న చోరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆస్తి నేరాలను తగ్గించాలని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులకు కారణాల్ని అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి సూచనలిచ్చారు. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన కమ్యునిటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. వాహనాల చోరీలకు సంబంధించి అవగాహన కల్పించాలన్నారు. బక్రీద్‌ను పురస్కరించుకుని మూగజీవాల రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పండుగ రోజు దర్గాల వద్ద బందోబస్తు పటిష్టం చేయాలని, వరంగల్‌కు ఉన్న కీర్తి ప్రతిష్టలు తగ్గకుండా పోలీసింగ్‌ ఉండాలని ఆయన పేర్కొన్నారు. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బేసిక్‌ పోలీసింగ్‌ ఉండాలని సీపీ ఆదేశించారు. కార్యక్రమంలో డీసీపీలు షేక్‌ సలీమా, రాజమహేంద్రనాయక్‌, అంకిత్‌ కుమార్‌, జనగామ ఏఎస్పీ చైతన్య, అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్‌, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

నిజాయితీగా పనిచేయాలి..

నిజాయితీగా పని చేస్తూ.. పోలీస్‌ శాఖకు కీర్తి ప్రతి ష్టలు తీసుకురావాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ సూచించారు. మంగళవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఏఎస్సైలుగా పని చేస్తూ.. సబ్‌ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన జనార్దన్‌, నారాయణ, సీతారాములు సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో పరిపాలనా విభాగం అదనపు డీసీపీ రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement