
టెంట్ సిటీలో దొంగలు పడ్డారు..
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26 వరకు జరిగిన సరస్వతీనది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం 40 టెంట్సిటీ నిర్మాణాలు చేపట్టింది. సోమవారం పుష్కరాలు పూర్తి కావడంతో బుధవారం నుంచి టెంట్సిటీలోని ఏసీలు, ఫర్నిచర్, బెడ్స్ తదితర వ స్తువులు తీసుకెళ్లడానికి సిద్ధం చేశారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి టెంట్సిటీకి చెందిన 8 ఏసీ కంప్రెషర్స్, 3 కూలర్లు, డార్మెటరీకి చెందిన 9 బెడ్స్, దిండు, బెడ్షీట్స్, డ్రెస్సింగ్ మిర్రర్లు, గ్రీన్ నెట్ బాండిల్, కుర్చీలు దుండగులు ఎత్తుకెళ్లారు. రెండు రోజులుగా ఆ ప్రాంతంలో ఎలాంటి బందోబస్తు లేకపోవడం, విద్యుత్ దీపాలు వెలుగకపోవడంతో దుండగులు రెక్కీ నిర్వహించి ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై సంబంధిత ఆలీఎలిమెంట్ ప్రైవేట్ సంస్థకు చెందిన నిర్వాహుకులు కాళేశ్వరం పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తమాషారెడ్డి తెలిపారు.
8 ఏసీ కంప్రెషర్స్, 3 కూలర్లు,
ఇతర విలువైన వస్తువుల అపహరణ