తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్‌ పార్టీ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్‌ పార్టీ

May 6 2025 12:34 AM | Updated on May 6 2025 12:34 AM

తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్‌ పార్టీ

తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్‌ పార్టీ

కాళేశ్వరం: కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు పట్టిన శని, దరిద్రం అని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. సోమవారం జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ.. వాస్తవాలు’ అనే కార్యక్రమాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, వాటర్‌బోర్డు కార్పారేషన్‌ మాజీ చైర్మన్‌ వి.ప్రకాశ్‌, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, విద్యాసాగర్‌రావు, చిన్న య్య, చందర్‌, మాజీ జెడ్పీచైర్‌పర్సన్‌లు శ్రీహర్షిణి, వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. కేసీఆర్‌ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ అంతటికీ సాగు, తాగునీరందించారని, అలాంటి ప్రాజెక్టుకు రిపేర్లు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించడానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేయడంలేదని, తెలంగాణ రైతులపై చిత్తశుద్ధి ఉంటే మంత్రి శ్రీధర్‌బాబు రిపేర్లు చేయించాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. ఒక్క పిల్లర్‌ కుంగితే మొత్తం ప్రాజెక్టు కుంగినట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిసమావేశాల్లో ప్రస్తావిస్తున్నారని, ప్రాజెక్టుపై దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలన్నారు. నీటిరంగ నిపుణులు వి.ప్రకాశ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బ్యారేజీలు కూలిపోడమే సీఎం రేవంత్‌రెడ్డి ఆశయమని, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంలో ఎవరికీ అనుమానం లేకున్నా.. తనకుందని అనడంలో కుట్ర దాగి ఉన్నదని పేర్కొన్నారు. బ్యారేజీ కుంగిపోవడం, భారీ శబ్దం రావడంపై ఇప్పటికీ ఎన్‌డీఎస్‌ఏ నివేదికలు ఇవ్వలేదని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ.. ఇప్పటికై నా కాంగ్రెస్‌ ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి రైతంగానికి నీటిని అందించాలన్నారు. అంతకు ముందు గోదావరిని పరిశీలించారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఏజెంట్‌ రేవంత్‌రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్‌ చేయకుండా నిర్వీర్యం చేస్తుండ్రు

శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి

కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement