
డీజీపీ చేతుల మీదుగా రివార్డులు
వరంగల్ క్రైం: మత్తు పదార్థాలను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులకు రాష్ట్ర డీజీపీ జితేందర్ రివార్డులు అందజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాంటీ నార్కొటిక్స్ ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాలను పట్టుకునేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఇన్స్పెక్టర్లు కరుణాకర్, సుధాకర్రెడ్డి, సార్ల రాజు, శ్రీధర్ కృషి చేశారు. తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో శనివారం రాత్రి హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ వారిని అభినందించి రివార్డులు అందజేశారు. వారిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అభినందించారు.