సాహిత్యంలో రారాజు కొసరాజు
నగరంపాలెం(గుంటూరు ఈస్ట్) : కొసరాజు సాహిత్యం ద్వారా ఆయన వ్యక్తిత్వం ఎవరెస్ట్ శిఖరమంతా ఉన్నతంగా వెలుగుతుందని మహా సహస్రావధాని ప్రవచన కిరీటి డాక్టర్ గరికపాటి నరసింహారావు అన్నారు. సోమవారం గుంటూరులోని జేకేసీ కళాశాల సమావేశ మందిరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), తానా ప్రపంచ సాహిత్య వేదిక, మనసు ఫౌండేషన్ సంయుక్తంగా సాహిత్య పరిశోధకులు పారా అశోక్కుమార్ నేతృత్వంలో రూపొందిన కొసరాజు సర్వలభ్య రచనల సంకలనం పుస్తకావిష్కరణ సభ జరిగింది. తొలుత ఈ గ్రంథాన్ని ఊరేగింపుగా సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. అనంతరం కొసరాజు జీవిత మాలికపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను అతిథులు ప్రారంభించి, కొసరాజు విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు.
కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ జాగర్లమూడి మురళీమోహన్, పత్తిపాటి దేవాక్షమ్మ, చలసాని అనురాధ, కస్తల పద్మ, డాక్టర్ కొసరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు


