డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం
గుంటూరు మెడికల్: అంతర్జాతీయ మధుమేహ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎన్సీడీ జిల్లా అధికారి డాక్టర్ రోహిణి రత్నశ్రీ, ఎన్సీడీ కన్సల్టెంట్ డాక్టర్ కె.గిరిధర్లు వైద్య శిబిరంలో పాల్గొని అగాహన కల్పించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి షుగర్, బీపీ పరీక్షలు చేశారు. తరచూ మూత్ర విసర్జన, దృష్టి లోపం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించి షుగర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు.


