ఎరువుల కొరత లేకుండా చూడండి | - | Sakshi
Sakshi News home page

ఎరువుల కొరత లేకుండా చూడండి

Oct 24 2025 7:46 AM | Updated on Oct 24 2025 7:46 AM

ఎరువుల కొరత లేకుండా చూడండి

ఎరువుల కొరత లేకుండా చూడండి

ఎరువుల కొరత లేకుండా చూడండి

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

బల్లికురవ: రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించాలని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. అద్దంకి నియోజకవర్గ వ్యవసాయ సిబ్బందితో ఎరువులపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలకు రబీ సీజన్‌లో డీఏపీ ఎక్కువ అవసరం ఉంటుందని ఎరువుల కొరత లేకుండా రైతులకు అందించాలని వ్యవసాయ కమిషనర్‌ మంజీర్‌ జిలానీకి సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, అద్దంకి, మార్టూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బి.ఎఫ్రాయిం, సుదర్శన రాజు నియోజకవర్గ వ్యవసాయాధికారులు వెంకటకృష్ణ, రామ్‌మోహన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు, షేక్‌ సైదా, వెంకటరామయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement