
ఏషియన్ షూటింగ్ పోటీల్లో ముఖేష్కు పతకాల పంట
గుంటూరువెస్ట్ (క్రీడలు): కజకిస్తాన్లోని షెమ్కెంట్లో జరుగుతున్న ఏషియన్ షూటింగ్ చాంపియన్ షిప్లో గుంటూరుకు చెందిన షూటర్ నేలవల్లి ముఖేష్ పతకాల పంట పండించాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో 50 మీటర్ల ఫ్రీ పిస్టల్, 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ , 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ టీమ్ విభాగాల్లో 3 బంగారు పతకాలు, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించాడు. భారత్ జూనియర్ జట్టులో సభ్యుడైన ముఖేష్ కొన్ని సంవత్సరాలుగా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తున్నాడు. రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా అరుదైన రికార్డును సైతం నెలకొల్పాడు. ఈ సందర్భంగా ముఖేష్ను రైఫిల్ అసోసియేషన్ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు సలలిత్, రాజ్ కుమార్తోపాటు కేఎల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ డీన్ హరికిషోర్లు అభినందించారు.