
రైతు సంఘం నేతపై టీడీపీ నాయకుల దాడి
క్రోసూరు అమరావతి బస్టాండ్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో
క్రోసూరు: కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని సీజీజీబీ బ్యాంకులో గోల్డ్ బాఽధితులకు అండగా నిలిచి పోరాడుతున్న రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు తిమ్మిశెట్టి హనుమంతరావుపై దొడ్లేరు గ్రామానికి చెందిన టీడీపీ మండల అద్యక్షుడు మొగల్జాను, అతని తమ్ముడు సమీర్ దాడిచేశారని బాధితుడితో కలిసి సీపీఎం నేతలు గురువారం క్రోసూరులోని అమరావతి బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ విషయమై బాధితుడు తిమ్మిశెట్టి మాట్లాడుతూ తాను దొడ్లేరు గ్రామం వెళ్తుండగా, టీడీపీ మండల అధ్యక్షుడు మొగల్జాను, అతని తమ్ముడు దారికాచి దుర్భాషలాడుతూ నీకు ఇక్కడేం పని.. దొడ్లేరు ఎందుకొస్తున్నావంటూ దాడిచేసి కొట్టారని తెలిపాడు. గతంలో సాగు నీరు విషయమై కూడా దౌర్జన్యం చేశారని తెలిపారు. తనపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ కట్టి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కలిసి డిమాండ్ చేస్తూ సీపీఎం నేతలతో కలిసి రాస్తారోకో చేశారు. ఆందోళనకారులతో సీఐ సురేష్, ఎస్ఐ రవిబాబు మాట్లాడి విరమింపజేశారు.