మోదీతోనే దేశాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

మోదీతోనే దేశాభివృద్ధి

Jun 13 2025 5:27 AM | Updated on Jun 13 2025 1:21 PM

మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

గుంటూరు మెడికల్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదకొండేళ్ల పాలన జన రంజకంగా సాగిందని, మోదీ చేసిన అభివృద్ధి పనులు దేశ చరిత్రలో చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో నిలిచిపోతాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు అధ్యక్షతన స్థానిక గొట్టిపాటి కల్యాణ మండపంలో వికసిత్‌ భారత్‌ అమృతకాల సేవ సుపరిపాలన 11 సంవత్సరాల అభివృద్ధిపై గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలన దేశ ప్రజల్లో మార్పు, నమ్మకానికి ప్రతిరూపంగా నిలిచిందన్నారు. 

కులమతాలకతీతంగా అభివృద్ధి పథకాలతో 27 కోట్ల పేదలను దారిద్య్రరేఖ నుంచి బయటకు తెచ్చిన ఘనత మోదీకే దక్కుతోందన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్షన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్‌ నారాయణ, టుబాకో బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు యడ్లపాటి స్వరూపరాణి, జిల్లా ఇన్‌చార్జి తమనంపూడి రామకృష్ణారెడ్డి, జిల్లా సంయోజక్‌ భీమినేని చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీవారి కల్యాణం

నగరంపాలెం: స్థానిక ఎస్‌.వి.ఎన్‌ కాలనీ శ్రీపద్మావతి గోదా సమేత శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రెండో రోజుకి చేరాయి. ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యా హవచనం, అగ్ని ధ్యానం, నిత్య హోమం వన కుంభారోహణం, శ్రీవెంకటేశ్వర మూల మంత్ర హోమం వేద పండితులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం వేళ స్వామి, అమ్మవార్ల ఎదుర్కోల ఉత్సవాన్ని చేపట్టారు. అనంతరం శ్రీపద్మావతి గోదా సమేత శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు వట్టికూటి పూర్ణచంద్రరావు దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు కల్యాణాన్ని తిలకించారు. కార్యదర్శి నల్లమోతు వెంకటరత్తయ్య, కోశాధికారి డాక్టర్‌ పుచ్చా వెంకటమల్లేశ్వర్‌, సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.

విద్యాసంస్థలకు ఫైన్‌ క్వాలిటీ బియ్యం

జాయింట్‌ కలెక్టర్‌ ఎ.భార్గవ్‌ తేజ

గుంటూరు వెస్ట్‌: విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలకు నాణ్యమైన ఫైన్‌ వైరెటీ బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ ఎ.భార్గవ్‌తేజ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమయ్యాయన్నారు. దీనిలో భాగంగా పౌరసరఫరాల కార్పొరేషన్‌ రబీలో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లుల్లో సీఎంఆర్‌ చేయించి, అనంతరం నిల్వ చేసిన బియ్యం విద్యార్థులకు అందించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. సులభంగా ప్యాక్‌ చేయడానికి అనుకూలంగా 25 కేజీల బస్తాలుగా రీప్యాక్‌ చేస్తున్నామన్నారు. గుంటూరు జిల్లాలో 1072 పాఠశాలలు, 68 హాస్టళ్లకు అవసరమైన 25 కేజీల 9,693 రైస్‌ బ్యాగ్‌లను ఇప్పటికే సరఫరా చేశామన్నారు. సివిల్‌ సప్లయీస్‌ జిల్లా మేనేజర్‌ జి.లక్ష్మి పాల్గొన్నారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం గురువారం 512.60 అడుగుల వద్ద ఉంది. ఇది 136.1274 టీఎంసీలకు సమానం.

మోదీతోనే దేశాభివృద్ధి 1
1/2

మోదీతోనే దేశాభివృద్ధి

విద్యాసంస్థలకు ఫైన్‌ క్వాలిటీ బియ్యం2
2/2

విద్యాసంస్థలకు ఫైన్‌ క్వాలిటీ బియ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement