రైతులకు నష్టపరిహారం అందజేస్తాం | - | Sakshi
Sakshi News home page

రైతులకు నష్టపరిహారం అందజేస్తాం

Jun 13 2025 5:25 AM | Updated on Jun 13 2025 5:27 AM

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజ్‌లో 2024 జనవరి 19న జరిగిన అగ్నిప్రమాదం వల్ల వేలాది మంది రైతులు తమ పసుపు పంటలను కోల్పోయారని, వారికి నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు చుట్టుగుంటలోని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనరేట్‌ కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి గురువారం ఆయన బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రమాదంపై కలెక్టర్‌ స్థాయి అధికారులతో విచారణ చేపట్టామని, రైతులకు ఎంత నష్టం వాటిల్లింది అనే అంశంపై నివేదిక తీసుకున్నామన్నారు. పసుపు క్వింటాకు రూ.7 వేలు రైతులకు అందజేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇన్స్యూరెన్స్‌ కంపెనీ నుంచి నగదు అందగానే రైతులకు డబ్బులు అందజేస్తామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఇన్స్యూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతూనే ఉన్నామని త్వరితగతిన పరిహారం అందజేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.

దుగ్గిరాల కోల్డ్‌స్టోరేజ్‌ బాధిత రైతులకు

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement