
కొనసాగుతున్న బదిలీల కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని మండల పరిషత్ పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీ (తెలుగు)లకు మాన్యువల్ విధానంలో బదిలీల కౌన్సెలింగ్ కొనసాగుతోంది. జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం సీనియార్టీ జాబితాలోని వరుస క్రమంలో 751 నుంచి 1750 వరకూ పేర్లు ఉన్న ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్ కె.సుబ్బారెడ్డి పరిశీలించారు. కాగా శుక్రవారం ఉదయం 8 గంటలకు జెడ్పీ యాజమాన్యంలోని ఎస్జీటీలు(తెలుగు) 1751 నుంచి 2400 నంబరు వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని డీఈఓ సీవీ రేణుక తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి మున్సి పాల్టీల్లో పని చేస్తున్న ఎస్జీటీలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో జిల్లా పరిశీలకురాలు పి.శైలజ, పల్నాడు డీఈఓ చంద్రకళ, డీఈఓ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్లు రమణ, శైలజ, ఏపీఎస్డీఎంఏ డీపీఎం ఎ.లక్ష్మీకుమారి పాల్గొన్నారు.
నేడు జెడ్పీ, మున్సిపల్ ఎస్జీటీలకు ..