
జెడ్పీలో మున్సిపల్ ఉపాధ్యాయుల ఆందోళన
గుంటూరు ఎడ్యుకేషన్: క్లస్టర్ వారీగా ఖాళీలను చూపించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఉపాధ్యాయులు శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఆందోళన నిర్వహించారు. ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్లో భాగంగా మున్సిపల్ ఉపాధ్యాయులకు ఆన్లైన్లో ఖాళీలను ప్రదర్శిస్తూ, మాన్యువల్ విధానంలో ఎంపిక చేసుకునేలా కౌన్సెలింగ్ నిర్వహించారు. దీనిపై డీఈవో సీవీ రేణుక, ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి సమాధానమిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జెడ్పీలో గత మూడు రోజులుగా ఎస్జీటీలకు నిర్వహిస్తున్న బదిలీల కౌన్సెలింగ్ శనివారం ముగియనున్నట్లు డీఈవో సీవీ రేణుక తెలిపారు. సీనియార్టీ జాబితాలోని వరుస క్రమంలో 2,401 నుంచి చివరి వరకు పేర్లు ఉన్న ఉపాధ్యాయులు శనివారం హాజరుకావాలని ఆమె సూచించారు.
క్లస్టర్ వారీగా ఖాళీలను చూపించాలని డిమాండ్