
తెనాలి కోర్టులో జిల్లా జడ్జి పర్యటన
తెనాలిరూరల్: తెనాలి కొత్తేపేటలోని కోర్టుల ప్రాంగణాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి గురువారం పరిశీలించారు. కోర్టు భవనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దెబ్బతిన్న భవనాలకు మరమ్మతులకు అంచనాలు సిద్ధం చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఇంకా మెరు గైన సౌకర్యాలు కల్పించేందుకు ఏం చేయాలి? అని అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదులకు భవనం లేదని బార్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ వినతిపత్రం అందజేశారు. అనంతరం జడ్జీల క్వార్టర్లను ప్రధాన న్యాయమూర్తి పరిశీలించారు. మెరుగైన సౌకర్యాల కల్పనకు ఏం చర్యలు తీసుకోవాలన్న విషయమై నివేదిక ఇవ్వాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.శ్రీనివాసులు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్ ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.వివేక్ వర్ధన్, రెండోఅదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.రాజశేఖర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాసు గౌరీ శంకర్, జాయింట్ సెక్రటరీ అప్పల కిషోర్, న్యాయవాదులు పాల్గొన్నారు.
దెబ్బతిన్న కోర్టు భవనాలు,
జడ్జిల క్వార్టర్లు పరిశీలన