అరచేత వైకుంఠం.. ! | - | Sakshi
Sakshi News home page

అరచేత వైకుంఠం.. !

Jun 12 2025 3:49 AM | Updated on Jun 12 2025 3:49 AM

అరచేత

అరచేత వైకుంఠం.. !

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ప్రస్తుత కూటమి పాలన రాష్ట్రాన్ని సంక్షేమం నుంచి సంక్షోభం వైపునకు తీసుకు వెళ్తోంది. ఐదేళ్ల వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కులమతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూశారు. ఎన్నికల్లో తర్వాత మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి పాలన ఏరు దాటాకా తెప్ప తెగలేసిన చందంగా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్‌ మాత్రమే పెంచిన కూటమి ప్రభుత్వం మిగిలిన పథకాలన్నింటికి తిలోదకాలు ఇచ్చింది. సూపర్‌ సిక్స్‌లో ఇప్పటి వరకూ ఒక్కటీ అమలులోకి రాలేదు. ప్రజలకు ఆర్థికంగా చేయూత లేకపోవడంతో కొనుగోలు శక్తి క్షీణించింది. మార్కెట్‌లో వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది.

ప్రజల్లో తీవ్ర అసంతృప్తి

నెలనెలా అప్పులు చేస్తూ ప్రభుత్వం నెట్టుకొస్తోంది. రాజధాని పేరుతో చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మినహా మరే వ్యాపారం సాగడం లేదు. దీంతో ఏడాది కూడా గడవకముందే కూటమి పాలనపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. సామాన్య ప్రజలపై దౌర్జన్యాలు, ప్రతిపక్ష పార్టీ నేతలపై తప్పుడు కేసులు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుపై పెడుతున్న దృష్టిని ప్రజల సంక్షేమం మీద పెట్టడం లేదు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్‌కు గ్యారెంటీ’ అంటూ ఇంటింటికీ కరపత్రాలు పంచారు. అధికారంలోకి వచ్చిన రెండునెలల తర్వాత మాట మార్చారు. అసలు సూపర్‌ సిక్స్‌ హామీలను చూస్తుంటేనే భయం వేస్తుందంటున్నారు. ‘‘మనం హామీలిచ్చాం. సూపర్‌ సిక్స్‌ చెప్పాం. చూస్తే భయమేస్తాంది. ముందుకు కదల్లేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి’’ అంటూ చంద్రబాబునాయుడు కొత్త పల్లవి అందుకున్నారు.

బాబు మోసాల చిట్టా

లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు

యువతకు మొండి

చెయ్యి

ముఖ్యమంత్రి చంద్రబాబు వంచన పాలనకు ఏడాది గడిచింది. మోసానికి పేటెంట్‌ ఇస్తే అది ఆయనకే చెందుతుంది. ఎన్నికల సమయంలో అలవికాని హామీలు ఊదరగొట్టడం, ఆ తర్వాత వాటిని అమలు చేయకపోవడం ఆయన నైజం. ప్రజల్ని మోసం చేయడంలో దిట్ట. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్‌ సిక్స్‌ గురించి ఊదరగొట్టారు. తాము వస్తే సంపద సృష్టించి, సంక్షేమం అమలు చేస్తామని పగల్భాలు పలికారు. గుంటూరులో ఏకంగా ఐటీ టవర్లు కట్టి ఉపాధి కల్పిస్తామని చిటికెల పందిళ్లు వేశారు. ఏడాది పూర్తయ్యే సరికి ఇచ్చిన వందలాది హామీల్లో ఏ ఒక్కదాన్ని నెరవేర్చలేదు. నమ్మించి మోసగించిన చంద్రబాబుపై పేద మధ్యతరగతి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో ఓట్లు కోసం హామీలు ఇచ్చిన ఆయన తర్వాత ప్లేటు ఫిరాయించడం, ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే సంబరాలకు సిద్ధం కావడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

కూటమి ఏడాది పాలనంతా మోసం

సంక్షేమం పక్కదారి

రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు

అధికారం కోసం సూపర్‌ సిక్స్‌

వాగ్దానాలు

గద్దె ఎక్కాక మాట మార్పు

గాలిలో కలిసిన హామీలు

రాజధాని పేరుతో హడావుడి

ఇప్పటివరకు ముందుకు పడని అడుగు

గుంటూరు జిల్లాలో పూర్తిగా మంత్రి లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగమే నడుస్తోంది. పోలీసులు ఏ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్నా లోకేష్‌ అండ్‌ టీం అనుమతి ఉండాల్సిందే. లేకపోతే కేసు కూడా నమోదు కాని పరిస్థితి నడుస్తోంది. ముఖ్యంగా సోషల్‌మీడియా ఫిర్యాదులైతే పూర్తిగా తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రతిపక్షాల నుంచి ఎవరు ఫిర్యాదు చేసినా అది బుట్టదాఖలే అవుతోంది. సోషల్‌ మీడియా కేసులు, వైఎస్సార్‌సీపీ నేతలపై పెడుతున్న కేసుల విషయంలో వారి వైఖరి ప్రశ్నార్థకంగా మారింది. ఒకే కేసులో ఒకే విషయంపై పలుచోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారు. గుంటూరు జిల్లాలో సోషల్‌మీడియా కార్యకర్తలపై పలు కేసులు పెట్టి జైలుకు పంపారు. కోర్టులు ఆక్షింతలు వేస్తున్నా పోలీసుల వైఖరి మారడం లేదు. చినబాబు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.

తల్లికి వందనం కింద సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ. 15,000 ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ఇప్పుడు ఇస్తామని చెబుతున్నా ఎవరికి వస్తుందో, ఎవరికి రాదో అన్నది ఇప్పటికీ ప్రశ్నార్ధకంగానే ఉంది.

ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలెండర్లు అందిస్తామన్నారు. ఇప్పటి వరకూ ఒక్క మహిళకు కూడా ఉచిత గ్యాస్‌ సిలెండర్ల తాలూకు డబ్బులు జమకాలేదు.

ఆడబిడ్డల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని తెస్తామన్నారు. ప్రతీ మహిళకు నెలకు రూ. 1500లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమచేస్తామన్నారు.

అన్నదాతకు అండగా ఏడాదికి రూ. 20 వేలు చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇంత వరకు పైసా విదల్చలేదు.

యువతకు ఉపాధి కల్పిస్తాం.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికొకరికి ఉద్యోగం ఇస్తాం.. లేదంటే రూ. 3 వేలు భృతి ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు, ముఖ్యంగా చంద్రబాబునాయుడు ఊదరగొట్టారు. యువతను ప్రపంచ ఆర్థ్ధిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాం.. పరిశ్రమలు తెస్తాం.. ఉద్యోగాలిస్తాం అంటూ ఊదరగొట్టారు. గుంటూరు జిల్లాలో 5,58,000 కుటుంబాలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. ముఖ్య మంత్రి యువ నేస్తం పథకం కుటుంబంలో ఎవరికై నా పెన్షన్‌ వస్తే ఇవ్వమని, కనీస ఆదాయం పదివేల రూపాయలకు మించి ఉండకూడదని మెలిక పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐదు ఎకరాల కంటే సాగు భూమి ఉండకూడదని, పట్టణ ప్రాంతాలలో 1500 చదరపు అడుగుల నివాస స్థలం ఉండకూడదనే షరతులను ప్రభుత్వం పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగాలకు కనీస వయోపరిమితి 45 సంవత్సరాలు ఉంటే ముఖ్యమంత్రి యువ నేస్తం నిరుద్యోగ భృతి పథకానికి 35 సంవత్సరాలుగా నిర్ణయించడం సరికాదని విద్యార్థి, యువజన సంఘాలు అంటున్నాయి. వయోపరిమితి 45 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకూ నోరు మెదపలేదు.

అరచేత వైకుంఠం.. ! 1
1/4

అరచేత వైకుంఠం.. !

అరచేత వైకుంఠం.. ! 2
2/4

అరచేత వైకుంఠం.. !

అరచేత వైకుంఠం.. ! 3
3/4

అరచేత వైకుంఠం.. !

అరచేత వైకుంఠం.. ! 4
4/4

అరచేత వైకుంఠం.. !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement