డల్లాస్‌లో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల సమావేశం | - | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల సమావేశం

May 27 2025 1:48 AM | Updated on May 27 2025 1:48 AM

డల్లాస్‌లో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల సమావేశం

డల్లాస్‌లో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల సమావేశం

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన, సంక్షేమం దక్కాయని అవర్‌ స్టేట్‌.. అవర్‌ లీడర్‌ సభ్యుడు అప్పిడి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. యూఎస్‌ఏ పర్యటనలో ఉన్న కిరణ్‌కుమార్‌ రెడ్డి సోమవారం డల్లాస్‌లో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ప్రజల్లో విశ్వసనీయత, ఆదరాభిమానాలు పొందారని అన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు వారి కుటుంబాలు, పిల్లల అభివృద్ధిని తన ఆనందంగా భావించి, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని ఆశించారని అన్నారు. యుఎస్‌ఏలోని అవర్‌ స్టేట్‌ – అవర్‌ లీడర్‌ సభ్యుడు శివ అన్నపురెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సారధ్యంలోని గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, సంక్షేమ కార్యక్రమాలను నిర్విరామంగా అమలు చేసేందుకు కోవిడ్‌ ప్రభావంతో రెండేళ్ల పాటు ఎన్నో ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కొన్నారని తెలిపారు. సంతమాగులూరు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు, అరెస్టుల పర్వం మినహా ప్రజా సంక్షేమం, ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఆలోచన లేకుండా పోయిందన్నారు. ఈసందర్భంగా అవర్‌ స్టేట్‌ – అవర్‌ లీడర్‌, ఇంటలెక్చువల్‌ ఫోరమ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.శాంతమూర్తి మాట్లాడుతూ గ్రూపునకు చెందిన 700కు పైగా సభ్యులు రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలు, దేశాల్లో వైఎస్‌ జగన్‌ నాయకత్వాన్ని బలపర్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రమణారెడ్డి, డాక్టర్‌ రామిరెడ్డి, ప్రసాద్‌ భీమవరపు, సాంబిరెడ్డి, పాల్‌ రెడ్డి, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement