
కేసులు ఎక్కువగా పరిష్కరించేందుకు సహకరించాలి
గుంటూరు లీగల్: జులైలో జరగబోవు లోక్ అదాలత్లో కేసులు ఎక్కువుగా పరిష్కరించేందుకు సహకరించాలని జిల్లా జడ్జి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ స్టేక్ హోల్డర్స్ , కంపెనీ న్యాయవాదులతో బుధవారం సమావేశం నిర్వహించారు. వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల గురించి జిల్లా జడ్జి వివరించారు. నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్ . శరత్బాబు, మూడవ అదనపు జిల్లా జడ్జి సీహెచ్. వెంకట నాగ శ్రీనివాసరావు, రెండవ అదనపు జిల్లా జడ్జి వై.నాగరాజా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్, బార్ ప్రెసిడెంట్ వై. సూర్యనారాయణలు ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూషన్ ప్రతినిధులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. సమావేశంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, శ్రీ రామ్ ట్రాన్స్పోర్టు, మార్గదర్శి చిట్ ఫండ్, కపిల్ చిట్ ఫండ్, చలపతి ఫైనాన్స్, కంపెనీ కౌన్సెల్స్ పాల్గొన్నారు .