తైక్వాండో పోటీల్లో పలువురికి పతకాలు | - | Sakshi
Sakshi News home page

తైక్వాండో పోటీల్లో పలువురికి పతకాలు

May 7 2025 2:20 AM | Updated on May 7 2025 2:20 AM

తైక్వ

తైక్వాండో పోటీల్లో పలువురికి పతకాలు

తెనాలిఅర్బన్‌: ఇండియన్‌ తైక్వాండో వారు నిర్వహించిన ఫస్ట్‌ ఫెడరేషన్‌ కప్‌, కిడ్స్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో తెనాలి కెఎస్‌ఆర్‌ తైక్వాండో అకాడమికి చెందిన షణ్ముఖ అభిరామ్‌, లంకరాజు శిరీషలకు బంగారు పతకాలు, లంకరాజు శ్రీ శౌర్యకు వెండి పతకం లభించినట్లు కోచ్‌ కె.శ్రీనివాసరావు తెలిపారు. వీటిని మహారాష్ట్రంలో ఏప్రిల్‌ 25నుంచి మే ఒకటి వరకు నిర్వహించినట్లు చెప్పారు. పతకాలు సాధించిన విద్యార్థులను మంగళవారం అకాడమి ఆవరణలో అభినందించారు. కార్యక్రమంలో వీరవల్లి మురళి, కె.నాగభూషణం, టి.పోతురాజు, కె.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

మంగళగిరి: ‘‘ముగ్గురు కుమారులకు జన్మనిచ్చింది.. వారికి కష్టం అంటూ తెలియకుండా భర్తతో కలిసి కష్టపడుతూ గారాబంగా పెంచి, విద్యాబుద్ధులు చెప్పించి, పెద్దవారిని చేసింది. అందరికీ పెళ్లిల్లు చేసి.. జీవితాలు చక్కదిద్దింది. ఈక్రమంలో ముదిమి మీదపడింది.. భర్త కాలం చేశాడు.. పుట్టెడు దుఖఃలో ఉన్నా అండగా కొడుకులు ఉన్నారులే.. అంటూ సముదాయించుకుని, కుమారుల చెంతకు చేరింది. వారు కనీసం ఇళ్లల్లోకి రానివ్వలేదు సరికదా.. ముఖం పైనే తలుపులేశారు. పోనీలే.. వాళ్లకు తెలీదులే అనుకుంటూ వేరే చోట ఇల్లు అద్దెకు తీసుకుని, కూలీనాలీ చేసుకుంటూ ఒంటరిగా బతకసాగింది. ఇంతలో విధి వక్రీకరించి, కాలు విరిగింది. తన పనులు తాను చేసుకోలేని దుస్థితిలో మంచానపడింది. ఇంటియజమానులు ఖాళీ చేయాల్సిందేనంటూ హుకూం జారీచేయగా, కొందరు సహృదయులు ఆమెను ఆటోలో కన్నకొడుకుల ఇళ్లకు తీసుకెళ్లారు. మంచానపడి దీనావస్థలో ఉన్న ఆ వృద్ధ తల్లిని చూసికూడా కరగలేదా పాషాణ హృదయాలు.. ఆమెకు మాకు ఏసంబంధం లేదంటూ.. మా ఇంటికి ఎందుకుతెచ్చారంటూ తెచ్చినవారిపై పోట్లాటకు దిగారు.’’

వివరాల్లోకి వెళితే పెదకాకాని మండలం నంబూరుకు చెందిన కొండవీటి మాణిక్యమ్మకు ముగ్గురు కుమారులు. భర్త మృతి చెందాడు. తాను పెంచి పోసించిన కుమారులు ఎవరు ఇంటిలోనికి రానివ్వకపోవడంతో మండలంలోని పెదవడ్లపూడి చేరుకుని తన రెక్కల కష్టం మీద బతుకుతుంది. ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ప్రశాంతంగా నివసిస్తున్న మాణిక్యమ్మ ఇటీవల బాత్రూమ్‌లో కాలు జారిపడడంతో దెబ్బతగిలి నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో వంట కూడా చేసుకోలేని దుస్థితి నెలకొంది. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమనడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాణిక్యమ్మ దుస్థితిని తెలుసుకున్న గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ అన్నే చంద్రశేఖర్‌ ఆమెను ఆటోలో తీసుకుని పెదకాకానిలోని కుమారులు వద్దకు తీసుకెళ్లాడు. కుమారులు తమకు ఆమెకు, మాకు సంబంధం లేదని తెగేసి చెప్పడంతో వృద్ధురాలిని పెదకాకాని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు.

తైక్వాండో పోటీల్లో పలువురికి పతకాలు 1
1/2

తైక్వాండో పోటీల్లో పలువురికి పతకాలు

తైక్వాండో పోటీల్లో పలువురికి పతకాలు 2
2/2

తైక్వాండో పోటీల్లో పలువురికి పతకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement