
జీజీహెచ్లో హిపో క్రేడ్స్ విగ్రహం
గుంటూరు మెడికల్: ఫాదర్ ఆఫ్ మెడిసిన్గా పిలువబడే హిపోక్రేడ్స్ విగ్రహాన్ని గుంటూరు జీజీహెచ్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా గుంటూరు జీజీహెచ్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈమేరకు సోమవారం విగ్రహాన్ని తెనాలి నుంచి గుంటూరు జీజీహెచ్కు తీసుకొచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ ప్రత్యేక శ్రద్ధతో విగ్రహాన్ని తయారు చేయించారు. ఓపీ విభాగంలో నాట్కో క్యాన్సర్ సెంటర్కు వెళ్లే రహదారిలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు.