కలెక్టర్ నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అర్జీదారులు పదే పదే వస్తున్నారని, ఈ విధానం మారాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ చిన్న చిన్న అంశాలను కొందరు సిబ్బంది అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలు చాలా కీలకమన్నారు. వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కరించాలన్నారు. అనంతరం వచ్చిన 231 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.