పురుగుమందు తాగి మెకానిక్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పురుగుమందు తాగి మెకానిక్‌ ఆత్మహత్య

Mar 24 2025 2:30 AM | Updated on Mar 24 2025 2:29 AM

చేబ్రోలు: పురుగుమందు తాగి బైక్‌ మెకానిక్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. సుద్దపల్లి గ్రామానికి చెందిన షేక్‌ మౌలాలి (36) నారాకోడూరు గ్రామ సమీపంలో బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి వద్ద భోజనం చేసి వెళ్లిన మౌలాలి నారాకోడూరు గ్రామ సమీపంలోని రైస్‌ మిల్లు వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ పెళ్లి చేసుకున్న మూడేళ్లకే బలవన్మరణం!

వివాహిత అనుమానాస్పద మృతి

తాడేపల్లి రూరల్‌: ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం కుంచనపల్లిలో జరిగింది. బంధువుల కథనం ప్రకారం.. కుంచనపల్లికి చెందిన నల్లపు సంజీవరావు, విజయకుమారి దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె కుక్కమల్ల సౌందర్య (26) 2022లో అదే గ్రామానికి చెందిన రాజును ప్రేమించింది. పెద్దలను ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అదే గ్రామంలో భర్తతో కలిసి జీవిస్తోంది. అయితే ఇటీవల సౌందర్యను రాజు, అతని కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధిస్తున్నట్టు సమాచా రం. శనివారం రాత్రి తన భర్త వేధిస్తున్నాడంటూ తండ్రి సంజీవరావుకు సౌందర్య ఫోస్‌ చేసింది. ఆదివారం ఉదయం బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తండ్రి సంజీవరావు, కుమారులు సౌందర్య నివాసానికి వెళిగ అప్పటికే సౌందర్యను ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడకు వెళ్లగా సౌందర్య మృతి చెందిందని వైద్యులు తెలిపారు. భర్త, అతని తరఫు కుటుంబ సభ్యుల వేధింపుల వల్ల తన కుమార్తె సౌందర్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని సంజీవరావు విలపిస్తున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు

సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో పది మందికి తీవ్ర గాయాలైన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల లయోలా ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు సమీపంలోని నల్లపాడుకు చెందిన 25 మంది నాగార్జునసాగర్‌ వెళ్లి మొక్కు తీర్చుకొని తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో 25 మంది ప్రయాణిస్తుండగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.

పురుగుమందు తాగి మెకానిక్‌ ఆత్మహత్య  1
1/3

పురుగుమందు తాగి మెకానిక్‌ ఆత్మహత్య

పురుగుమందు తాగి మెకానిక్‌ ఆత్మహత్య  2
2/3

పురుగుమందు తాగి మెకానిక్‌ ఆత్మహత్య

పురుగుమందు తాగి మెకానిక్‌ ఆత్మహత్య  3
3/3

పురుగుమందు తాగి మెకానిక్‌ ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement