పెదకాకాని: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విద్యావతి శనివారం పెదకాకాని బాజీబాబా దర్గాను సందర్శించారు. పెదకాకాని హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి విద్యావతికి సిబ్బంది దర్గా మర్యాదలతో స్వాగతం పలికారు. దర్గా చుట్టూ ప్రదక్షిణలు చేసిన న్యాయమూర్తి అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. దర్గా సిబ్బంది న్యాయమూర్తి విద్యావతిని శాలువాతో సత్కరించారు. ఈనెల 29, 30 తేదీల్లో ఉరుసు మహోత్సవం జరగనున్న నేపధ్యంలో రూ.5వేల నగదు విరాళంగా అందజేసినట్లు దర్గా సిబ్బంది తెలిపారు.
ఉగాది పండుగ
ఏర్పాట్లు పరిశీలన
వెలగపూడి(తాడికొండ): తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలోని రాష్ట్ర సచివాలయంలో ఈనెల 30వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది వేడుకల కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను శనివారం ఏపీ సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిలు పరిశీలించారు. వేడుకలు జరుగనున్న ప్రాంతం, సభావేదిక, ఏర్పాట్లు పలు అంశాలను అధికారులతో చర్చించి పలు సూచనలు, సలహాలు జారీ చేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ భార్గవతేజ, ఆర్డీవో శ్రీనివాసరావు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సమయపాలన పాటించండి
– ఎకై ్సజ్ డీసీ డాక్టర్ కె.శ్రీనివాసులు
నెహ్రూనగర్: మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాస్ సూచించారు. శనివారం జిల్లాలోని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులతో గుంటూరు 1 టౌన్ ఎకై ్సజ్ స్టేషన్ వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మద్యం డిపో నుంచి తీసుకువచ్చే లిక్కర్ వివరాల నమోదు పక్కాగా ఉండాలన్నారు. తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. ఈ సమావేశంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వి.అరుణకుమారి, ఏఈఎస్ ఎం.మారయ్యబాబు, ఎకై ్సజ్ వన్టౌన్ సీఐ లత, టూ టౌన్ సీఐ యశోధర ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
లైంగిక వేధింపుల
నివారణపై అవగాహన
కర్లపాలెం: లైంగిక వేధింపుల నివారణ, పోక్సో చట్టంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ఆరో అదనపు జడ్జి కె.శ్యామ్బాబు చెప్పారు. కర్లపాలెం మండల పరిఽధిలోని పేరలి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి కె.శ్యామ్బాబు మాట్లాడుతూ లైంగిక వేధింపులు, అశ్లీలత వంటి నేరాల వంటివి విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా పేదలు న్యాయ సహాయం పొందవచ్చునని చెప్పారు.
బాజీబాబా దర్గాను సందర్శించిన హైకోర్టు జడ్జి