చంద్రబాబుకు డ్రైవర్లంటే చిన్నచూపు
చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ ఆటో డ్రైవర్లంటే చిన్నచూపు. వీరి సంక్షేమం కోసం ఏ రోజూ ఆలోచించ లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తొమ్మిది నెలలు గడిచినా అమలు చేయలేదు. ప్రభుత్వ తీరుతో కార్మికులు నష్టపోతున్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.
– శేషగిరి పవన్కుమార్ (వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు)
రవాణా రంగం నిర్వీర్యం
ప్రైవేటు రైడ్ యాప్స్ వచ్చాక ఆటో డ్రైవర్లు బేరాలు లేక నష్టపోతున్నారు. రోజంతా తిరిగితే రూ.300 కూడా మిగలట్లేదు. భారీ జరిమానాలు చెల్లించలేకపోతున్నాం. గత ప్రభుత్వం ఏటా రూ.10 వేలు వాహనమిత్ర ద్వారా ఇచ్చేది. ఈ సర్కారు రూపాయి సాయం చేయలేదు. పైగా రవాణా రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది.
– షేక్ సంధాని, ఆటోడ్రైవర్, గుంటూరు
ఉపాధికి గండి
ప్రైవేట్ రైడ్ యాప్స్ వచ్చాక ఆటో డ్రైవర్ల ఉపాధికి గండిపడింది. భారీ జరిమానాలూ కుంగదీస్తున్నాయి. ప్రభుత్వం మా సంక్షేమంపై దృష్టి సారించాలి. ఎన్నికల హామీలు నెరవేర్చాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాదిరిగా వాహనమిత్ర అమలు చేస్తే కొంత ఆర్థిక భరోసా లభిస్తుంది.
– ఎస్.నరసింహారావు, ఆటోడ్రైవర్, గుంటూరు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు కూటమి సర్కారు తూట్లు పొడుస్తోంది. కార్మికులు, ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది. అధికారంలోకి రాగానే వాహనమిత్ర అందిస్తామని డ్రైవర్లను నమ్మించింది. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా ఆ సంగతే మాట్లాడడం లేదు.
గుంటూరు జిల్లాలో సుమారు 25 వేలకుపైగా ఆటోలు ఉంటాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆటో, కారు డ్రైవర్ల సంక్షేమానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. ఏటా వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా రూ 10 వేల ఆర్ధిక సాయాన్ని అందించి ఆదుకున్నారు. ఈ మొత్తాన్ని ఆటోవాలాలు ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ), ఇన్సూరెన్స్, ఇతరత్రా అవసరాలకు వినియోగించుకునేవారు. దీంతో పాటు నవరత్నాల ద్వారా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలూ డ్రైవర్ల కుటుంబాలకు అందేవి. అయితే గత ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కంటే మిన్నగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మబలికారు. వాహనమిత్ర కూడా అమలు చేస్తామని చెప్పారు. అదంతా నిజమని కోటి ఆశలు పెట్టుకున్న వాహనదారులకు ఇప్పుడు నిరాశే ఎదురైంది. సంక్షేమ పథకాలు అందకపోగా.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దీనికితోడు భారీ జరిమానాలతో రవాణాశాఖ జూలు విదులుస్తోంది. దీంతో వాహనదారులు, ఆటోడ్రైవర్లు, మోటార్ వర్కర్లు లబోదిబోమంటున్నారు. ఎన్నికల హామీల అమలు, తమ డిమాండ్ల సాధనకు ఇప్పటికే కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెలఖారులో విజయవాడలో జరగనున్న ఆటో డ్రైవర్ల రాష్ట్ర మహాసభల్లో సర్కారు తీరును ఎండగట్టాలని కార్మికులు ఐక్యంగా నిర్ణయించారు.
భారీగా జరిమానాల పెంపు
కూటమి సర్కారు వచ్చాక జీవో నంబర్ 21 అమలు చేస్తూ భారీ జరిమానాలతో వాహనదారుల నడ్డివిరుస్తోంది. గతంలో డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పాల్యూషన్, ఇన్సూరెన్స్ లేకపోతే రూ.500 నుంచి రూ.750 వరకు జరిమానాలు విధించేవారు. ప్రస్తుతం జీవో నంబరు 21 వచ్చాక డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ.5 వేలు, పర్మిట్ లేక పోతే రూ.10 వేలు, ఇన్సూరెన్స్ లేకుంటే రూ.3 వేల నుంచి రూ.5 వేలు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే రూ.3 వేల నుంచి రూ.5 వేలు, ఫిట్నెస్ లేకపోతే రూ.5 వేలు జరిమానా విధిస్తున్నారు.
ప్రైవేటు చేతికి ఫిట్నెస్ పరీక్షలు
రవాణా రంగంలో ఉన్న ఆటో, వ్యాన్లు, కార్లు వంటి వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేసే విధానాన్ని ఫిబ్రవరి నుంచి ప్రైవేటు ఏజెన్సీకి కూటమి సర్కారు అప్పగించింది. ఏటా అవసరాన్ని బట్టి ఫీజు పెంచుకునే వెసులుబాటూ కల్పించింది. గతంలో ఫిట్నెస్ ఫీజు రూ.700 ఉండగా దానిని రూ.800కు పెంచారు.
కూటమి సర్కారు బే‘కార్’ హామీలు
ప్రతి మహిళకు నెలకు రూ.1500...
కూటమి అధికారంలోకి వస్తే 18–59 ఏళ్లలోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని ఊదరగొట్టారు. బడ్జెట్లో దీని ఊసే లేదు. ఎన్టీఆర్ జిల్లాలో 8,30,958 మంది, కృష్ణా జిల్లాలో 7,39,202 మంది అర్హులైన మహిళలు ఉన్నారు. వీరంతా బాబు మాట నమ్మి నిండా మునిగామని నిట్టూరుస్తున్నారు.
వైఎస్ జగన్ హయాంలో వాహనమిత్ర లబ్ధి ఇలా..
సంవత్సరం వాహనదారులు లబ్ధి మొత్తం
(రూ.కోట్లలో)
2019–20 20,594 20.95
2020–21 25,177 25.18
2021–22 23,837 23.84
2022–23 12,137 12.13
2023–24 12,540 12.54
ఐదేళ్లలో మొత్తం 94.64
కార్మికులతో ఇదేమి ఆటో!
కార్మికులతో ఇదేమి ఆటో!
కార్మికులతో ఇదేమి ఆటో!
కార్మికులతో ఇదేమి ఆటో!