కొల్లిపర: టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు, ఇన్విజిలేటర్లపై ఉందని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం కొల్లిపర హైస్కూల్లో టెన్త్ పరీక్ష కేంద్రాన్ని తెనాలి సబ్కలెక్టర్ వి.సంజన సింహా , తహసీల్ధారు సిద్ధార్థ, ఎంపీడీఓ వి.విజయలక్ష్మితో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కేంద్రాన్ని ప్రభుత్వం సమస్యాత్మక కేంద్రంగా రికార్డుల్లో నమోదు చేయడంపై ఆరా తీశారు. మనబడి నాడు–నేడు ద్వారా పాఠశాల అభివృద్ధికి ఎన్ని నిధులు మంజూరయ్యాయి? ఇంకా ఎంత అవసరమవుతాయన్న వివరాలూ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఎంఈఓ–2 ఝూన్సీలత తదితరులు ఉన్నారు.
టెన్త్ హిందీ పరీక్షకు 27,491 మంది హాజరు
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని 150 కేంద్రాల్లో బుధవారం జరిగిన టెన్త్ హిందీ పరీక్షకు 27,664 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 27,491 మంది హాజరయ్యారు. 21 కేంద్రాల్లో దూరవిద్య టెన్త్ పరీక్షలకు 1,039 మందికి 836 మంది హాజరైనట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. రాష్ట్ర పరిశీలకురాలు పి.పార్వతి ఐదు పరీక్షా కేంద్రాలు, జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ఏడు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 60 పరీక్ష కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
కలెక్టర్ నాగలక్ష్మి