మేయర్‌ పీఠాన్ని వదులుకోకూడదు | - | Sakshi
Sakshi News home page

మేయర్‌ పీఠాన్ని వదులుకోకూడదు

Mar 20 2025 2:33 AM | Updated on Mar 20 2025 2:32 AM

నెహ్రూనగర్‌(గుంటూరు ఈస్ట్‌): గుంటూరు మేయర్‌ పదవి విషయంలో భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్లాలని, ఎట్టిపరిస్థితిలో మేయర్‌ పీఠాన్ని వదులుకోకూడదని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు రాజీనామా చేసిన ఆనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై.. అత్యవసర కౌన్సిల్‌ సమావేశంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు బృందావన్‌ గార్డెన్స్‌లోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్‌ నూరి ఫాతిమా, డెప్యూటీ మేయర్‌ వనమా బాలవజ్రబాబుతో కలిసి అంబటి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు హాజరుకాలేదు. అంబటి మాట్లాడుతూ మేయర్‌ పదవి విషయంలో గట్టిగా వ్యవహరించాలని సూచించారు. సమావేశం వాయిదా పడినందున మళ్లీ జరిగే సమావేశానికి ముందు రోజున సమావేశమై కార్యాచరణ రూపొందిద్దామన్నారు. కూటమికి మేయర్‌ పదవి దక్కకుండా ఏం చేయడానికై నా పార్టీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లు మరింత బలంగా నిలబడి ప్రజల గొంతుకగా కౌన్సిల్‌లో ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

భవిష్యత్‌ కార్యాచరణౖపైవెఎస్సార్‌ సీపీ సమావేశం పార్టీ కార్పొరేటర్లతో జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు భేటీ హాజరైన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, డెప్యూటీ మేయర్‌ వజ్రబాబు, మోదుగులవేణుగోపాలరెడ్డి, నూరిఫాతిమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement