క్షయకు క్రమం తప్పకుండా మందులు వాడాలి | - | Sakshi
Sakshi News home page

క్షయకు క్రమం తప్పకుండా మందులు వాడాలి

Mar 20 2025 2:33 AM | Updated on Mar 20 2025 2:32 AM

కొల్లిపర: క్షయ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడాలని, పౌష్టికాహారం తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి తెలిపారు. ఎంఆర్‌ ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా ఆరోగ్యశాఖ సంయుక్త నిర్వహణలో కొల్లిపరలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో బుధవారం క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. రోగులకు పోషకాహార కిట్లను కలెక్టర్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ క్షయ రోగుల కోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 2,557 మంది క్షయ రోగులు ఉన్నట్టు వెల్లడించారు. క్షయ రోగులకు పౌష్టికాహారం అందించేందుకు ఎంఆర్‌ ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ ట్రస్టీ కొల్లి మేఘనారెడ్డి ముందుకు రావడం ముదావహమన్నారు. కొల్లి మేఘనారెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. తొలుత సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ నాగలక్ష్మి , తెనాలి సబ్‌కలెక్టర్‌ సంజనా సింహా ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. గ్రామంలో క్షయ రోగుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య స్థితి గురించి ఆరా తీశారు. క్షయ పరీక్షలను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పిల్లి రాధిక, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌, డియంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ విజయలక్ష్మి , డిసిహెచ్‌ఎస్‌ మయానా మస్జిదాబి , తహసీల్ధారు సిద్ధార్ధ, ఎంపీడీవో విజయలక్ష్మి, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భరత్‌, ఎంఆర్‌ ప్యూచర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి కొల్లి బాషిరెడ్డి, వైద్య సిబ్బంది, ఆశా వర్కులు, రోగులు పాల్గొన్నారు.

జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకం

గుంటూరు వెస్ట్‌: జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకమని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి బ్యాంకర్ల సమీక్ష జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్త అనే నినాదంతో ముందుకు వెళుతుందని, యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంతోపాటు, ఎంఎస్‌ఎంఈలకు బ్యాంకర్లు వేగంగా రుణాలు అందించాలన్నారు. రైతుతోపాటు, కౌలు రైతులకు కూడా బ్యాంకర్లు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ముఖ్యంగా రుణాల ప్రాసెసింగ్‌ అత్యంత వేగంగా నిర్వహించాలని చెప్పారు. జిల్లా అన్ని రంగాల్లో 15 శాతం పురోగతి సాధించడానికి బ్యాంకర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ మహిపాల్‌ రెడ్డి మాట్లాడుతూ రుణ లక్ష్యాలు, సాధించిన పురోగతిని వివరించారు. సమావేశంలో యూనియన్‌ బ్యాంకు డీజీఎం ఎస్‌.జవహర్‌, ఆర్‌బీఐ ఎల్డీఓ నవీన్‌ చిరునేని, నాబార్డు డీడీఎం ఇ.శరత్‌బాబు, జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు, పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ నాగలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement