మోతడక(తాడికొండ): చలపతి ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ నెల 12–22 వరకు తమ అన్ని బ్రాంచిలలో 4 రోజుల పాటు చలపతి మహోత్సవం పేరిట సంబరాలు నిర్వహిస్తున్నట్లు చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వైవీ ఆంజనేయులు తెలిపారు. మంగళవారం మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో పలువురు ప్రిన్సిపల్స్, అధ్యాపకులతో కలిసి ఆయన పోస్టరు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చలపతి మహోత్సవంలో భాగంగా ఈ నెల 19న ఐడియాథాన్, 20న వివిధ అంశాలలో సాంకేతిక పరమైన పోటీలు 21–22 తేదీలలో క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని సదావకాశం ఉపయోగించుకొని తమ ప్రతిభ నిరూపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కార్యదర్శి వై సుజిత్ కుమార్, డైరెక్టర్లు డి వినయ్ కుమార్, కె శ్రీనివాసరెడ్డి, జి సుబ్బారావు, ప్రిన్సిపల్స్ డాక్టర్ కె నాగ శ్రీనివాసరావు, డాక్టర్ ఎం చంద్రశేఖర్, అకడమిక్ డీన్లు, వివిధ శాఖాఽధిపతులు పాల్గొన్నారు.