కలెక్టర్ నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: ఓటరు కార్డులకు డోర్ నంబర్లు సక్రమంగా ఉండేలా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్కు, డోర్ నంబరుకు సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో జరుగుతోందన్నారు. రాజకీయ పార్టీల సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి పాల్గొన్నారు.
బాలల సంక్షేమానికి మరింత కృషి అవసరం
జిల్లాలో బాలల సంరక్షణ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేసి సత్ఫలితాలు సాధించేందుకు అధికారులు మరింత కృషి చేయాలన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బాలల సంరక్షణక తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ ఎం.ఉమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఈఓ రేణుక, డీపీఓ సాయికుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.