గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Mar 19 2025 2:09 AM | Updated on Mar 19 2025 2:10 AM

బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025

నిత్యాన్నదానానికి విరాళం

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ భవానీపురానికి చెందిన కనమర్లపూడి రామకృష్ణ, సౌమిత్రి పద్మవల్లి రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు.

ఇఫ్తార్‌ సహర్‌

(బుధ) (గురు)

గుంటూరు 6.24 4.56

నరసరావుపేట 6.26 4.58

బాపట్ల 6.24 4.56

సాక్షి ప్రతినిధి, గుంటూరు, నెహ్రూనగర్‌: గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్‌ ఎవరు నిర్వహించాలనే సందిగ్ధత గుంటూరు కార్పొరేషన్‌లో నెలకొంది. మేయర్‌ పదవికి కావటి మనోహర్‌నాయుడు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ రాజీనామా ఆమోదం కోసం కౌన్సిల్‌ సమావేశం ఈ నెల 20న నిర్వహించనున్నారు. అయితే ఇద్దరు డెప్యూటీ మేయర్లు ఉన్న నేపథ్యంలో సభ ఎవరు నిర్వహించాలనే విషయంపై సందిగ్ధత నెలకొంది. గతంలో పాలకవర్గం ఎన్నికై న వెంటనే మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు, డెప్యూటీ మేయర్‌గా వనమా బాలవజ్రబాబు(డైమండ్‌బాబు)ను కౌన్సిల్‌ సభ్యులు ఎన్నుకున్నారు. ఆ తర్వాత నాలుగు నెలలకు ఇద్దరు డెప్యూటీ మేయర్లకు అప్పటి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో రెండో డెప్యూటీ మేయర్‌గా షేక్‌ సజిలాను ఎన్నుకున్నారు. ఈ ప్రకారం చూస్తే డైమండ్‌బాబుకు నాలుగు నెలల సీనియారిటీ ఉంది. ఈ నేపథ్యంలో డైమండ్‌బాబును ఇన్‌చార్జ్‌ మేయర్‌గా పీఠంపై కూర్చొపెడితే తమకు ఇబ్బందులు వస్తాయని భావించిన కూటమి నేతలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరిన షేక్‌ సజిలకు అవకాశం ఇవ్వాలని కమిషనర్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో కమిషనర్‌ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఇప్పటి వరకూ దీనికి సర్కారు నుంచి సమాధానం రాలేదు. బుధవారం కూడా సమాధానం రాకుంటే కౌన్సిల్‌ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది. కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాతే కొత్త మేయర్‌ ఎన్నికల షెడ్యూల్‌ కోసం ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుంది.

మేయర్‌ పీఠంపై కూటమిలో రగడ

మరోవైపు కూటమిలో మేయర్‌ పీఠం కోసం అంతర్గత కుమ్ములాట మొదలైంది. తెలుగుదేశంపార్టీలో రెండు వర్గాలు పదవి కోసం పోటీ పడుతున్నాయి. జనసేన కూడా తమకు అవకాశం ఇవ్వాలని, లేకుంటే డెప్యూటీ మేయర్‌ ఇవ్వాలని పట్టుపడుతోంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఇప్పటికే మేయర్‌ అభ్యర్థిత్వం విషయలలో అధిష్టానం కోవెలమూడి రవీంద్ర(నానీ) పట్ల సానుకూలంగా ఉందంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసిన రోజునే ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు తొమ్మిది మంది కార్పొరేటర్లు సమావేశం నుంచి నిరసనగా బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, లోకేష్‌ కూడా నానీకి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాత్రమే నాని అభ్యర్ధిత్వానికి అనుకూలంగా ఉండగా, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌లు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి, కోవెలమూడి నానికి ఆధిపత్య పోరు నడుస్తోంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోవెలమూడి నానిని కాదని గల్లా మాధవికి ఇవ్వడంతో ఆయన కావాలనే మాధవిని ఓడించేందుకు యత్నాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మాధవి వర్గం వేములపల్లి శ్రీరాంప్రసాద్‌(ఇసుక బుజ్జి)ని మేయర్‌గా చేయాలని పట్టుపడుతోంది. తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ కూడా బుజ్జి వైపే మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.

7

కౌన్సిల్‌ ఎవరు నిర్వహించాలి ? కొనసాగుతున్న సందిగ్ధం మేయర్‌ రాజీనామాపై చర్చించేందుకు ఈనెల 20న కౌన్సిల్‌ సీనియర్‌ డెప్యూటీ మేయర్‌గా డైమండ్‌ బాబు టీడీపీలో ఉన్నందున సజిలకు ఇవ్వాలంటున్న కూటమి నేతలు ఏం చేయాలో చెప్పాలని ప్రభుత్వానికి కమిషనర్‌ లేఖ ఇంకా స్పందించని సర్కారు మేయర్‌ పీఠం కోసం కూటమిలో అంతర్గత కుమ్ములాట

న్యూస్‌రీల్‌

కాపు సామాజికవర్గం పోటీ

ఇప్పటి దాకా మేయర్‌గా ఉన్న కావటి కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ వర్గం కార్పొరేటర్లు మేయర్‌ సీటుకు పోటీ పడుతున్నట్లు సమాచారం. కాపులకే మేయర్‌ పీఠం ఇవ్వాలని కాపు సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు, ఇప్పటికే జనసేనలో చేరిన ఓ వర్గం పవన్‌ కళ్యాణ్‌ వద్ద మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ నుంచి జనసేనలోకి చేరిన కాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మల వెంకట రమణ, యిర్రి ధనలక్ష్మీ కూడా మేయర్‌ పీఠం కోసం యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో పక్క బీసీలు, మైనార్టీలలో ఆశావాహులు పెరిగిపోతుండటంతో కూటమి పెద్దలకు మేయర్‌ సీటు అంశం తలనొప్పిగా మారింది.

గుంటూరు1
1/8

గుంటూరు

గుంటూరు2
2/8

గుంటూరు

గుంటూరు3
3/8

గుంటూరు

గుంటూరు4
4/8

గుంటూరు

గుంటూరు5
5/8

గుంటూరు

గుంటూరు6
6/8

గుంటూరు

గుంటూరు7
7/8

గుంటూరు

గుంటూరు8
8/8

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement