శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025
నిద్రావస్థలో అధికార యంత్రాంగం
ప్రస్తుతం మోసాలు పెరిగాయి. ఆహార కల్తీ జరుగుతోంది. తూకాల మోసాలు జరుగుతున్నాయి. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం నిద్రపోతోంది. దీంతో వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారు. ఏదైనా సమస్యకు సంబంధించి ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించడం లేదు. ఇది చాలా దారుణం.
– టీవీ కృష్ణామూర్తి, జనరల్ సెక్రటరీ, జిల్లా వినియోగదారుల సంఘం
వ్యాపార సంస్థల స్వార్థం.. వినియోగదారును నిత్యం బలిపీఠం ఎక్కిస్తోంది. తూకం, నాణ్యత, ధర, వస్తు సేవల్లో దగా రాజ్యమేలుతోంది. పారదర్శకతకు పాతరేస్తోంది. చట్టాలపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం శాపంగా మారుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడడం వల్ల వ్యాపారులు మరింత పేట్రేగిపోతున్నారు. వజ్రాయుధంలాంటి వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంపై విస్తృత అవగాహన కల్పించడం వల్ల మోసాలకు చెక్ పెట్టవచ్చని వినియోగదారు హక్కుల సంఘాల నాయకులు చెబుతున్నారు. నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రజలను చైతన్యం చేసే చిరుప్రయత్నమిది..
ఇఫ్తార్ సహర్
(శని) (ఆది)
గుంటూరు 6.23 4.59
నరసరావుపేట 6.25 5.01
బాపట్ల 6.23 4.59
నెహ్రూనగర్, పట్నంబజార్ (గుంటూరు ఈస్ట్): ప్రస్తుతం సమాజంలో మోసాలు ఎక్కువయ్యాయి. తూకాల్లో ఘాతుకాలు పెరిగాయి. కల్తీ ఆహార పదార్థాలు భయపెడుతున్నాయి. పాలు, నీళ్లూ నాణ్యత లేకుండా పోతున్నాయి. వీటిని అరికట్టాలంటే వినియోగదారులు మేల్కోవాలి. హక్కులపై అవగాహన పెంచుకోవాలి. వినియోగదారు హక్కు ల పరిరక్షణ చట్టం, వినియోగదారుల ఫోరమ్, ఫిర్యాదులు ఎలా చేయాలి.. న్యాయం ఎలా పొందాలి వంటి అంశాల గురించి తెలుసుకోవాలి.
1986 నుంచి ప్రత్యేక చట్టం
భారతదేశంలో 1986లో వినియోగదారుల రక్షణ చట్టం రూపొందింది. అనంతర కాలంలో వాణిజ్య విధానాల్లో చాలా మార్పులొచ్చాయి. ఆన్లైన్ కొనుగోళ్లు పెరిగాయి. మోసాలు విభిన్న రూపాలు సంతరించుకున్నాయి. ఈ క్రమంలో వినియోగదారుల హక్కుల చట్టానికి మరింత పదును పెట్టి 2019లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ పేరుతో కొత్త చట్టం తీసుకువచ్చారు. 2020 జూలైలో ఇది అమల్లోకి వచ్చింది. కొత్త చట్టంలో వినియోగదారుల రక్షణ మండళ్ల ఏర్పాటు, మధ్యవర్తిత్వ ప్యానెళ్లు, అన్యాయ వాణిజ్య పద్ధతులపై కఠిన చర్యలు వంటివి పొందుపరిచారు.
విలువను బట్టి స్థాయి..
జిల్లా స్థాయిలో కన్జూమర్ ప్రొటెక్షన్ కమిషన్ ఉంటుంది. దీనినే వినియోగదారుల ఫోరమ్ అని కూడా పిలుస్తారు. వస్తు సేవల్లో లోపాలు జరిగితే ఈ కమిషన్(జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న కన్జూమర్ కోర్టు)లో లాయర్తో సంబంధం లేకుండా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఆన్లైన్లో అయినా 1915, 1800114000 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సమస్య చెబతే వారు జిల్లా స్థాయి కమిషన్కు తెలియజేస్తారు. 2024లో 365 కేసులు ఫైల్ అయ్యాయి, 2025 ఇప్పటి వరకు 66 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కొన్నేళ్లుగా పరిష్కారం కాక పెండింగ్లో ఉన్న కేసులు 580 ఉన్నాయి. రూ.50 లక్షల విలువైన వస్తుసేవల కేసులను జిల్లా స్థాయిలో విచారణ చేస్తారు. ఆ తర్వాత రూ.2 కోట్ల వరకు విలువైన కేసులను రాష్ట్ర కమిషన్లో విచారణ చేస్తారు. ఆౖపైన విలువ ఉంటే జాతీయ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాలి. కన్జూమర్ కోర్టులో ఎక్కువగా రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్ కొనుగోలు, ఆన్లైన్ మోసాలు, ఇన్సూరెన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వంటి కేసులు నమోదవుతున్నట్టు సమాచారం.
పాటించాల్సిన జాగ్రత్తలు
● వస్తువు కొనేటప్పుడు నాణ్యత చూసుకోవాలి.
● గ్యారెంటీ, తూకం, ధర తనిఖీ చేసుకోవాలి.
● వ్యాపారి వద్ద కచ్చితంగా రశీదు తీసుకోవాలి. ఇన్వాయిస్లు, ఐడీలను భద్రపరుచుకోవాలి.
ఫుడ్ సేఫ్టీ అధికారుల నియంత్రణేది?
ఆహారపదార్థాలనూ వ్యాపారులు కల్తీ చేస్తున్నారు. పండ్లలోనూ నాణ్యత ఉండడం లేదు. పండ్లను రసాయనాలతో పక్వానికి వచ్చేలా చేస్తున్నారు. కూల్ డ్రింక్స్, చిన్నారుల తినుబండారాల్లో కెమికల్స్ వినియోగిస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కనిపించడం లేదు.
ఇప్పటికీ వాడుతున్న రాళ్ల కాటా
7
న్యూస్రీల్
చట్టంపై అవగాహన పెంచుకోవాలి
బీమా పాలసీల క్లెయిముల్లోనూ మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. చాలా కేసుల్లో క్లెయిమ్లు పరిష్కారమయ్యేలా చూశాం. తూకాలు, వస్తు సేవల మోసాలపై న్యాయం చేసేందుకు వినియోగదారుల ఫోరమ్ ఉంది. వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి.
– పి.రామాంజనేయులు, వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు, అడ్వకేట్
దగా పడుతున్న వినియోగదారులు
వ్యాపార సంస్థల స్వార్థమే శాపం
పట్టించుకోని అధికారయంత్రాంగం
జిల్లా వినియోగదారుల ఫోరమ్లో
580 కేసులు పెండింగ్
రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్
నిర్వహణ కేసులే ఎక్కువ
నేడు ప్రపంచ వినియోగదారుల
హక్కుల దినోత్సవం
వినియోగదారుల ఫిర్యాదులకు
టోల్ఫ్రీ నంబర్లు
1915, 800114000
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు