నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ట్రిపుల్ ఎక్స్ సోప్ అధినేత డాక్టర్ అరుణాచలం మాణిక్యవేల్ (77) అంతిక్రియుల శుక్రవారం జరిగాయి. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం విధితమే. అరండల్పేట 10/2వ అడ్డరోడ్డులోని ఆయన నివాస గృహంలో సందర్శకుల సందర్శనార్థం ఉంచారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు షేక్.నూరిఫాతిమా, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి (పశ్చిమ), నసీర్అహ్మాద్ (తూర్పు), ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, పలువురు ప్రముఖులు మాణిక్యవేల్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మాణిక్యవేల్ అంతిక్రియలు కొరిటెపాడులోని శశ్మాన వాటికలో జరిగాయి. కుటుంబ సభ్యులు, ట్రిపుల్ ఎక్స్ సోప్ ఉద్యోగులు, సిబ్బంది పెద్దఎత్తున తరలివెళ్లారు.