తెనాలిరూరల్: సారా రహిత రాష్ట్రమే ధ్యేయంగా నవోదయం–2 కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాస్ చెప్పారు. పట్టణంలో బార్ షాపులు, వైన్ షాపుల లైసెన్సుదారులతో తెనాలి కొత్తపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం పాలసీ, విధివిధానాలను వివరించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మద్యం విక్రయించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిపై శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు.
గుంటూరు, పల్నాడు పరిధిలో మాచర్ల, నరసరావుపేట, క్రోసూరు, ఈపూరు, పిడుగురాళ్ల, గురజాల గ్రామాలను సారా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామన్నారు. ఎక్సైజ్ శాఖ నిర్వహించిన దాడుల్లో 28 సారా కేంద్రాలను నిర్వీర్యం చేశామన్నారు. నవోదయం –2 కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ద్వారా సారా నిర్మూలనకు కృషి చేస్తామని చెప్పారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారిణి కె.అరుణకుమారి, జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మారయ్యబాబు, తెనాలి ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎ.వెంకటాచలం పాల్గొన్నారు.