కవయిత్రి మొల్లమాంబ చిరస్మరణీయురాలు | - | Sakshi
Sakshi News home page

కవయిత్రి మొల్లమాంబ చిరస్మరణీయురాలు

Mar 14 2025 1:41 AM | Updated on Mar 14 2025 1:39 AM

నెహ్రూనగర్‌(గుంటూరు ఈస్ట్‌): రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన కవయిత్రి మొల్లమాంబ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. మొల్లమాంబ జయంత్యుత్సవాన్ని పురస్కరించుకుని బృందావన్‌ గార్డెన్స్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె విగ్రహానికి అంబటి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ కుమ్మరి శాలివాహన కులంలో జన్మించి వాల్మీకి రామాయణాన్ని అందరికీ అర్థమయ్యేలా సరళంగా తెలుగులోకి అనువదించిన మొల్లమాంబ శ్రీరాముడిని భక్తి శ్రద్దలతో కొలిచేవారని చెప్పారు. ఆమె జయంతిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినట్టు గుర్తుచేశారు. వైఎస్సార్‌ సీపీ కుమ్మరి శాలివాహన రాష్ట్ర అధ్యక్షులు మండేపూడి పురుషోత్తం మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కుమ్మరి వర్గాన్ని గుర్తించి అధికారికంగా మొల్ల జయంతిని నిర్వహించాలని జీఓ తీసుకురావడం అభినందనీయమన్నారు. వైఎస్‌ జగన్‌ కుమ్మరి శాలివాహనులకు శీశైలంలో సత్రం కోసం 50 సెంట్లు, నరసరావుపేట కోటప్పకొండ వద్ద 50 సెంట్లు కేటాయించారని గుర్తుచేశారు. తిరుపల, తిరుపతి దేవస్థానంలో మొల్ల తెలుగులోకి అనువదించిన వాల్మీకి రామాయణాన్ని బ్రహోత్సవాల సందర్భంగా అక్కడ ప్రదర్శించడం గర్వించదగ్గ విషయామన్నారు. కార్యక్రమంలో నగర డెప్యూటీ మేయర్‌, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు(డైమండ్‌ బాబు) పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement