నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): పేద ప్రజల పక్షాన నిలబడేందుకు, వారి కన్నీటిని తుడిచేందుకు 14 ఏళ్ల కిత్రం వైఎస్సార్ సీపీని వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించారని ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బృందావన్ గార్డెన్స్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో గుంటూరు, పల్నాడు పార్లమెంటరీ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నగర మేయర్ కావటి మనోహర్నాయుడు, గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, ఇతర ముఖ్య నేతలతో కలిసి పార్టీ జెండాను అంబటి ఆవిష్కరించారు.
● అంబటి రాంబాబు మాట్లాడుతూ అసత్యాలతో అధికారంలోకి వచ్చిన అధికార కూటమిపై వైఎస్సార్ సీపీ సంక్షేమ జెండాదే నైతిక విజయమని పేర్కొన్నారు. పార్టీ ప్రస్తుతం బలంగా ఉందని, శ్రేణులు ఉత్సాహంగా ప్రజాపోరాటాలకు పునరంకితమవుతున్నారని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కంకణబద్ధులమవుదామని పిలుపు ఇచ్చారు.
● మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడూ గర్వపడేలా వైఎస్సార్ సీపీ పుట్టిందన్నారు. ఈ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఫీజురీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను అవస్థలకు గురిచేస్తోందన్నారు. మెడికల్ కాలేజీ సీట్ల విషయంలో గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. రానున్న కాలంలో పార్టీ శ్రేణులంతా మరింత కష్టపడి ఏకతాటిపై నిలబడి పార్టీ గెలుపు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
● నగర మేయర్ కావటి మనోహర్నాయుడు, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అబద్ధాలతో అధికారం చేపట్టి పేదల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు.
● వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీ కృష్ణ మాట్లాడుతూ ప్రజలకు వైఎస్సార్ సీపీ అండగా నిలబడుతోందని, ప్రజల పక్షాన పోరాడుతోందని చెప్పారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ వజ్రబాబు, పార్టీ మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ప్రత్తిపాడు సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పేదల కోసం ఆవిర్భవించిన పార్టీ వైఎస్సార్ సీపీ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు వైభవంగా పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం పార్టీ శ్రేణుల్లో వెల్లువెత్తిన నవోత్సాహం పార్టీ జెండాల ఆవిష్కరణతో ప్రజాపోరాటాలకు పునరంకితం
సంక్షేమ జెండాదే నైతిక విజయం