1,22,426 బస్తాలు మిర్చి విక్రయం | - | Sakshi
Sakshi News home page

1,22,426 బస్తాలు మిర్చి విక్రయం

Mar 8 2025 2:28 AM | Updated on Mar 8 2025 2:24 AM

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు శుక్రవారం 1,11,958 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 1,22,426 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 44,470 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.

పసుపు ధరలు

దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో శుక్రవారం 229 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్‌ యార్డు కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొమ్ములు 140 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.8,000 గరిష్ట ధర రూ.9,800 మోడల్‌ ధర రూ.9,400, కాయలు 89 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ఠి ధర రూ.8,000, గరిష్ఠ ధర రూ.9,800, మోడల్‌ ధర రూ.9,400, మొత్తం 171.750 క్వింటాళ్లు అమ్మకాలు జరిగినట్లు ఆయన వివరించారు.

బ్యాంక్‌ ఉద్యోగుల నిరసన

కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఈమేరుక ఉద్యోగులు, అధికారులు శుక్రవారం చంద్రమౌళి నగర్‌లోని కెనరా బ్యాంక్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బ్యాంక్‌ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక(యుఎఫ్‌బీయూ) జిల్లా కన్వీనర్‌ బాషా మాట్లాడుతూ బ్యాంక్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌బీఐ ఉద్యోగ సంఘ నేత పరేంద్ర మాట్లాడుతూ ఐడీబీఐ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. యూబీఐ ఉద్యోగ నేత రాంబాబు, యూఎఫ్‌బీయూ సలహాదారుడు పి.కిషోర్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement