మంగళగిరి/మంగళగిరి టౌన్: మంగళగిరిలోని శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజు శుక్రవారం రాత్రి స్వామిని హనుమంత వాహనంపై ఊరేగించారు. అభయ ప్రదాత అయిన హనుమంతుని భుజ స్కందాలపై లక్ష్మీ నరసింహస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా అధిరోహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ ఈవో రామకోటి రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు (రాజేష్) కై ంకర్యపరులుగా వ్యవహరించారు. శనివారం రాత్రి రాజాధిరాజ వాహనంపై స్వామి గ్రామోత్సవం జరగనుంది.
హనుమంత వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత
నృసింహుడు
ఉత్సవానికి హాజరైన భక్తులు
హనుమంత వాహనంపై నృసింహుడు