విద్యుత్‌ చౌర్యం కేసులో రూ. 85వేలు జరిమానా | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ చౌర్యం కేసులో రూ. 85వేలు జరిమానా

Mar 7 2025 9:48 AM | Updated on Mar 7 2025 9:48 AM

గుంటూరు లీగల్‌: విద్యుత్‌ చౌర్యం కేసులో జరిమానా విధిస్తూ జడ్జి వి.ఎ.ఎల్‌.సత్యవతి తీర్పు చెప్పారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన వేల్పుల పెదఏసు 2016 నవంబరు 15న అక్రమంగా విద్యుత్‌ వినియోగిస్తుండగా ఆ శాఖ అధికారి ఎం.కోటయ్య తనిఖీల్లో పట్టుకున్నారు. దీనిపై ఆయన యాంటీ పవర్‌ తెఫ్ట్‌ స్క్వాడ్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌ఐ కె. హనుమంతరావు విచారణ చేసి నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఒకటో అదనపు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో జడ్జి వి.ఎ.ఎల్‌.సత్యవతి రూ. 85వేలు జరిమానా విధించారు. కట్టలేని పక్షంలో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వజ్రాల రాజశేఖరరెడ్డి వాదనలను వినిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement