గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Mar 14 2024 1:40 AM | Updated on Mar 14 2024 1:40 AM

- - Sakshi

గురువారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2024
అగ్రవర్ణ పేదలకు ఆర్థిక ధిలాసా

ఇఫ్తార్‌ సహరి

(గురు) (శుక్ర )

గుంటూరు 6.23 5.00

చిలకలూరిపేట 6.26 5.00

బాపట్ల 6.23 5.00

నెహ్రూనగర్‌: గతంలో ఏ ప్రభుత్వమూ అగ్రవర్ణ పేదల సంక్షేమం, అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. సంక్షేమ ఫలాలు కొన్ని వర్గాలకే పరిమితం చేశారు. దీంతో అగ్ర వర్గాలలో పుట్టినప్పటికీ పేదరికంతో బాధపడేవారు బయటకు చెప్పుకోలేక అనేక ఇబ్బందులు పడ్డారు. తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా అన్ని వర్గాల కష్టాల్ని విని, చూసి ఇప్పటివరకు లేని ఎన్నో సంక్షేమ పథకాల్ని రూపొందించారు ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం వివిధ పథకాల్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచే పలు సంక్షేమ పథకాలు రూపొందించారు. సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ఇంటి తలుపు తట్టీ మరి పథకాల్ని పార్టీలకతీతంగా అందిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకుబడిన అగ్రవర్ణాల పేద మహిళలకు ౖసైతం వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పేరిట వారికి ఆర్థిక భరోసా కల్పిస్తోంది. అందులో భాగంగా 45 – 60 ఏళ్లలోపు మహిళలకు ‘ఈబీసీ నేస్తం’ పథకం ద్వారా ఏడాదికి రూ.15వేల చొప్పున వరుసగా మూడేళ్లపాటు ఒక్కొక్కరికీ రూ.45 వేలు అందనుంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.30వేల నగదును ప్రభుత్వం జమ చేసింది. నంద్యాల జిల్లా బనగానపల్లిలో గురువారం జరగనున్న రాష్ట్రస్థాయి ప్రారంభోత్సవంలో సీఎం వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని నగదు జమను బటన్‌ నొక్కి ప్రారంభిస్తారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు, ఎంపిక చేసిన లబ్ధిదారులు పాల్గొననున్నారు.

అగ్రవర్ణ పేదలకు ఆపన్నహస్తం

రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమతో పాటూ మిగిలిన ఓసీ సామాజికవర్గానికి చెందిన మహిళలకు ఈబీసీ నేస్తం వర్తిస్తుంది. అగ్రవర్ణాలలోని కాపు సామాజిక వర్గానికి కాపునేస్తం ద్వారా మహిళలకు సహాయపడుతున్న సంగతి తెలిసిందే.

ఈబీసీ నేస్తం ద్వారా గుంటూరు జిల్లాలో మూడో విడతకు 21,687 మంది అర్హత సాధించారు. మహిళల ఖాతాల్లో నేడు రూ.32,53,05,000 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమకానున్నాయి. ఆర్థిక సహాయం పొందే లబ్ధిదారుల వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాలను ప్రదర్శించారు. లబ్ధిదారుల దగ్గరకు వెళ్లి ఆర్థిక సాయంపై అవగాహన కల్పించారు. నగదును ఖర్చు చేసుకోవడానికి ఎటువంటి ఆంక్షలు లేవు. ఇప్పటికే రెండు విడతలో గుంటూరు జిల్లాలో 46,031 మందికి గాను రూ.69.05 కోట్లు జమ చేశారు.

విగ్రహానికి పూలమాలలు వేస్తున్నవిప్‌ అప్పిరెడ్డి, కొణిజేటి రోశయ్య కుమారుడు వెంకటశివ

మాట్లాడుతున్న చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి

7

నేడు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం మూడో విడత నగదు జమ ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 వేలు జమ చేయనున్న ప్రభుత్వం గుంటూరు జిల్లాలో 21,687మంది మహిళలకు రూ. 32.53 కోట్లు లబ్ధి ఇప్పటికే రెండు విడతల్లో మొత్తం 46,031 మందికి రూ.69.05 కోట్లు జమ

న్యూస్‌రీల్‌

గుంటూరు జిల్లాలో ఈబీసీ నేస్తం అమలు తీరు

విడత లబ్ధిదారుల నగదు జమ

సంఖ్య రూ.కోట్లలో

తొలి రెండు విడతల్లో 46,031 69.05

మూడో విడత (నేడు) 21,687 32,53

1
1/7

2
2/7

3
3/7

4
4/7

5
5/7

6
6/7

7
7/7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement