
బాపట్ల అర్బన్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో వంద మీటర్ల పరుగుపందెంవిభాగంలో బాపట్లకు చెందిన శామ్యూల్ టైమ్స్ సత్తా చాటాడు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన అంతర్ జిల్లాల పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు. బాపట్ల డీఎంపల్లికి చెందిన శామ్యూల్ టైమ్స్ గుంటూరులోని హిందూ కాలేజీలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సిల్వర్ మెడల్ సాధించిన సందర్భంగా అతడ్ని కోచ్ రవి, అధ్యాపకులు అభినందించారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్లో ఎంపికై న శామ్యూల్ టైమ్స్